Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూస్ రిపోర్టర్ సాహసం ... మెడలోతు నీటిలో నుంచి రిపోర్టింగ్ (Video)

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (14:37 IST)
పాకిస్థాన్ దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఆ దేశంలో కురిసిన భారీ వర్షాలు దెబ్బకు గత 30 యేళ్ళలో ఎన్నడూ చూడని విధంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో తమ దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జర్నలిస్ట్ పెద్ద సాహసమే చేశారు. మెడలోతు నీటిలో దిగిన అక్కడ నుంచి రిపోర్టింగ్ చేశాడు. వార్తలను ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఆ రిపోర్టర్ ఇంత పెద్ద సాహసం చేశారు. ఈ కవరేజ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 
 
తమ దేశంలో నెలకొన్న వరద వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చూపించేందుకు ఆ రిపోర్టల్ మెడలోతు నీటిలో దిగారు. అతని శరీరం మొత్తం నీటిలో మునిగిపోయింది. తల, మైక్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిపోర్టర్ అంకితభావానికి, పనితీరుకు ఈ వీడియో నిదర్శనమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
అలాగే రిపోర్టర్ ప్రమాదంలో పడేసినందుకు న్యూస్ చానెల్‌పై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. "అత్యంత కఠిన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేసినందుకు మీకు హ్యాట్సాఫ్ సార్" అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం ఈ పాకిస్థాన్ రిపోర్టర్ చేసిన సాహసం సోషల్ మీడియాలో పుణ్యమాని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments