Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూస్ రిపోర్టర్ సాహసం ... మెడలోతు నీటిలో నుంచి రిపోర్టింగ్ (Video)

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (14:37 IST)
పాకిస్థాన్ దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఆ దేశంలో కురిసిన భారీ వర్షాలు దెబ్బకు గత 30 యేళ్ళలో ఎన్నడూ చూడని విధంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో తమ దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జర్నలిస్ట్ పెద్ద సాహసమే చేశారు. మెడలోతు నీటిలో దిగిన అక్కడ నుంచి రిపోర్టింగ్ చేశాడు. వార్తలను ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఆ రిపోర్టర్ ఇంత పెద్ద సాహసం చేశారు. ఈ కవరేజ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 
 
తమ దేశంలో నెలకొన్న వరద వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చూపించేందుకు ఆ రిపోర్టల్ మెడలోతు నీటిలో దిగారు. అతని శరీరం మొత్తం నీటిలో మునిగిపోయింది. తల, మైక్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిపోర్టర్ అంకితభావానికి, పనితీరుకు ఈ వీడియో నిదర్శనమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
అలాగే రిపోర్టర్ ప్రమాదంలో పడేసినందుకు న్యూస్ చానెల్‌పై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. "అత్యంత కఠిన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేసినందుకు మీకు హ్యాట్సాఫ్ సార్" అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం ఈ పాకిస్థాన్ రిపోర్టర్ చేసిన సాహసం సోషల్ మీడియాలో పుణ్యమాని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments