Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యుద్ధాన్ని భరించలేం... భారత్‌తో శాంతి కావాలి: పాకిస్థాన్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (15:56 IST)
భారత్‌తో మరో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఆ దేశంతో శాశ్వత శాంతిని కోరుకుంటున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెబాజ్ షరీఫ్ అన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ బృందంతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, కాశ్మీరీల అభిమతానికి అనుగుణంగా జమ్మూకాశ్మీర్ సమస్యను పరిష్కరించుకున్నపుడే దక్షిణాసియాలో సుస్థిర శాంతి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
"భారత్‌తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నాం. అది కూడా చర్చల ద్వారానే. యుద్ధం ఇరు పక్షాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పైగా, మేం మరో యుద్ధాన్ని భరించలేం. అందుకే పొరుగుదేశమైన భారత్‌తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నట్టు షెబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తమ దేశం దురాక్రమణ దేశంకాదన్నారు. అయితే, తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు, ఇతర సైనిక సంపత్తి అనేది విపత్కర పరిస్థితుల్లో తమ దేశాన్ని రక్షించుకునేందుకు మాత్రమేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అన్ని రంగాల్లో ప్రతి దేశం దూసుకుపోతుందన్నారు. ఇలాంటి సమయంలో ఇండోపాక్ దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలపై పోటీతత్వం పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments