Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి ఔషధాలను దిగుమతి చేస్కుంటున్న పాక్, ఇమ్రాన్‌ను నిలదీత

Webdunia
బుధవారం, 13 మే 2020 (17:51 IST)
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం గతేడాది ఆగస్టు 5న రద్దుచేసిన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత అడుగంటాయి. ప్రత్యేక హోదాని రద్దు చేయడంతో దాయాది దేశానికి ఆక్రోశం ఆగడం లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, పాకిస్థాన్ భారత్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. 
 
అయితే, కరోనా కారణంగా ప్రాణాధార ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడటంతో, భారత్ నుంచి కొన్నింటిని దిగుమతి చేసుకోడానికి పాక్ ప్రభుత్వం అనుమతించింది. వాటితో పాటు ఔషధాల తయారీకి అవసరమైన ముడిసరకును కూడా దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనిని అవకాశంగా చేసుకుని భారత్‌ నుంచి విటమిన్‌ మాత్రలు లాంటి 450కి పైగా ఔషధాలను దిగుమతి చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. 
 
దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. అక్రమ దిగుమతులకు సంబంధించిన విచారణ బాధ్యతలను తన సహచరుడు షాజాద్ అక్బర్‌కు అప్పగించారు. కాగా భారత్ నుంచి అనేక విటమిన్లు, ఔషధాలు, లవణాలు దిగుమతి చేసుకున్నట్లు నేషనల్ హెల్త్ సర్వీసెస్‌ పేర్కొన్నట్టు తెలియజేసే నివేదికను డాన్ పత్రిక ప్రచురించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments