Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి ఔషధాలను దిగుమతి చేస్కుంటున్న పాక్, ఇమ్రాన్‌ను నిలదీత

Webdunia
బుధవారం, 13 మే 2020 (17:51 IST)
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం గతేడాది ఆగస్టు 5న రద్దుచేసిన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత అడుగంటాయి. ప్రత్యేక హోదాని రద్దు చేయడంతో దాయాది దేశానికి ఆక్రోశం ఆగడం లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, పాకిస్థాన్ భారత్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. 
 
అయితే, కరోనా కారణంగా ప్రాణాధార ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడటంతో, భారత్ నుంచి కొన్నింటిని దిగుమతి చేసుకోడానికి పాక్ ప్రభుత్వం అనుమతించింది. వాటితో పాటు ఔషధాల తయారీకి అవసరమైన ముడిసరకును కూడా దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనిని అవకాశంగా చేసుకుని భారత్‌ నుంచి విటమిన్‌ మాత్రలు లాంటి 450కి పైగా ఔషధాలను దిగుమతి చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. 
 
దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. అక్రమ దిగుమతులకు సంబంధించిన విచారణ బాధ్యతలను తన సహచరుడు షాజాద్ అక్బర్‌కు అప్పగించారు. కాగా భారత్ నుంచి అనేక విటమిన్లు, ఔషధాలు, లవణాలు దిగుమతి చేసుకున్నట్లు నేషనల్ హెల్త్ సర్వీసెస్‌ పేర్కొన్నట్టు తెలియజేసే నివేదికను డాన్ పత్రిక ప్రచురించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments