Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో దారుణం... 23 మందిని కాల్చి చంపిన బీఎల్ఏ ఉగ్రవాదులు

ఠాగూర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (13:15 IST)
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఆ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లా ఈ దారుణం వెలుగు చూసింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రం నుంచి వస్తున్న వాహనాల్లోని వారిని కిందకు దించి ఉగ్రవాదాలు కాల్చి చంపారు. మొత్తం 23 మందిని హత్య చేశారు. మరో పది వాహనాలకు నిప్పు అంటించారు. 
 
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపేశారు. పంజాప్ నుంచి వస్తున్న వాహనాలను ఆపి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏకంగా పది వాహనాలకు నిప్పు పెట్టారు. 
 
ఈ దారుణం ఘటన వెనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ గ్రూపు చాలా బలంగా విస్తరించివుంది. ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి ఖండించారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటన వెనకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. అయితే, ఈ కాల్చివేత ఘటనకు సంబధించి బీఎల్ఏ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments