Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశం దివాళీ తాసింది.. : పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (11:07 IST)
పాకిస్థాన్ రక్షణ మంత్రి, పీఎంఎల్ ఎన్ పార్టీ కీలక నేత ఖ్వాజా మొహ్మద్ ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. తమ దేశం దివాళా తీసిందని చెప్పారు ఈ మేరకు ఆయన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి సంచలంగా, చర్చనీయాంశంగా మారాయి.
 
"మనం ఇపుడు దివాళా తీసిన దేశంలో జీవిస్తున్నాం. పాకిస్థాన్ విదేశీ అప్పులు చెల్లించలేకపోతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉందన్న వార్తలు మీరందరూ వినే ఉంటారు. కానీ, ఇది ఇప్పటికే జరిగిపోయింది. మనం దివాళా తీశాం. ఇపుడు మనం మళ్లీ మనకాళ్లపై నిలబడాలి. ఈ సమస్యకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పరిష్కారం కాదు. అసలు పరిష్కారం మన దేశంలోనే ఉంది" అని అన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకుని పోవడానికి కారణం ఇమ్రాన్ ఖాన్ చర్యలేనిని ఆయన ఆరోపించారు. ఆయన ఆరంభించిన ఆట కారణంగా ఉగ్రవాదమే పాకిస్థాన్ గమ్యంగా మారిందని వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ అసాధారణ స్థాయిలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని విదేశీ కరెన్సీ నిల్వలు మరోమూడు వారాల పాటు మాత్రమే దిగుమతులకు సరిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments