Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ముదిరిన అల్లర్లు : ఖాకీల కాల్పుల్లో ఏడుగురి మృతి!

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (11:29 IST)
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరిపోయింది. పాక్ ప్రధాని నవాజ్ షరీప్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, రాజధాని ఇస్లామాబాద్‍‌లో వేలాది మంది చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రధాని అధికార నివాసం వద్దకు చొచ్చుకువచ్చిన ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఆందోళనకారులు కూడా పోలీసులపైకి తిరగబడ్డారు. వీరి దాడుల్లో పోలీసులకు కూడా గాయాలయ్యాయి.  
 
దాదాపు 25 వేల మందితో పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రధాని అధికార నివాసానికి చేరుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా రహదారిపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆందోళనకారులు తొలగించారు. దీంతో పోలీసులు తొలుత టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. 2013 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి నవాజ్ షరీఫ్ విజయం సాధించారని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఇస్లామిక్ మత గురువు ఖాద్రీ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments