Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న ఆ పవర్‌ ప్రాజెక్టులు ఆపండి: పాకిస్థాన్

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే ఆపేయాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాకిస్థాన్‌లోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఈ మేరకు ఉమ్మడి తీర్మానం చేశాయి. జ

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (20:01 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల పనులను వెంటనే ఆపేయాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాకిస్థాన్‌లోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఈ మేరకు ఉమ్మడి తీర్మానం చేశాయి. జమ్మూకాశ్మీర్‌లోని కిషన్‌గంగా, రాట్లేలోని హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు జీలం, చీనాబ్‌ నదులపై నిర్మిస్తున్నారు. 
 
ఆ ప్రాజెక్టులు నిలిపేయాలని తీర్మానం చేసిన విదేశీ వ్యవహారాలు కమిటీ, జల, విద్యుత్‌ కమిటీలు సింధు నదీ జలాలపై ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు మధ్యవర్తి కోర్టును ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకును కోరాయి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ప్రపంచ బ్యాంకు ఎలాంటి జాప్యం లేకుండా ఈ విషయంపై స్పందించాలని అడిగాయి.
 
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తి న్యాయస్థానం ఏర్పాటు చేసే వివాదం పరిష్కారం అయ్యేవరకు భారత్‌ ప్రాజెక్టులు నిర్మించకుండా ప్రపంచబ్యాంకు ఒప్పించాలని కమిటీలు ఇచ్చిన ఉమ్మడి తీర్మానంలో పేర్కొన్నాయి. భారత్‌ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌ అన్ని దారుల్లో చర్యలకు దిగుతుందని, ఒప్పందం ఉల్లంఘనకు ఒప్పుకోబోమని పాక్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్‌ చౌదరి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments