Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ తమ దేశానికి మెడ నరం వంటిది : పాక్ ఆర్మీ చీఫ్ రహీల్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కాశ్మీర్ మెడ నరం వంటిదన్నారు. అందువల్ల కాశ్మీరీ పౌరులకు దౌత్యపరమైన, నైతిక మద్దతును కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (12:05 IST)
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కాశ్మీర్ మెడ నరం వంటిదన్నారు. అందువల్ల కాశ్మీరీ పౌరులకు దౌత్యపరమైన, నైతిక మద్దతును కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. 
 
పాకిస్థాన్ రక్షణ దినోత్సవాల సందర్భంగా రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్ వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్వయం నిర్ణయాధికారం కోసం కాశ్మీరు ప్రజలు చేస్తున్న గొప్ప త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలను అమలు చేయడమే కాశ్మీరు సమస్యకు ఏకైక పరిష్కారమార్గమన్నారు. 
 
అదేసమయంలో 'నేను శత్రువులందరికీ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నదేమిటంటే... పాకిస్థాన్ గతంలోనే బలమైనది, అది ఇప్పుడు మరింత అజేయశక్తిగా, దుర్భేద్యంగా మారింది. మాకు శత్రువుల అన్ని రకాల కుట్రల గురించి తెలుసునన్నారు. సవాలు సైనికపరమైనదైనా, దౌత్యపరమైనదైనా, సరిహద్దులో అయినా, నగరాల్లో అయినా, మా శత్రువులెవరో, మిత్రులెవరో మాకు బాగా తెలుసని, తమను ఏ శక్తీ ఓడించలేదని' ఆయన చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments