Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ కపుల్స్ సన్నిహితంగా ఉండగా వీడియో తీసి డబ్బుల కోసం బెదిరించి జైలుపాలు?

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (14:38 IST)
కొత్తగా పెళ్లైన దంపతులు హనీమూన్‌ కోసం దుబాయికి వెళ్లారు. ఈ దంపతులను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి (28) రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘటన దుబాయిలో కలకలం రేపింది. నాలుగు రోజుల హనీమూన్‌ కోసం వెళ్లిన భారత జంట దుబాయిలో కారులో నగరమంతా షికార్లు కొట్టారు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో కారు డ్రైవర్‌ ఫోన్‌లో రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ జంట కారు దిగి వెళ్లిపోయిన తర్వాత ఆ డ్రైవర్‌ వాట్సాప్‌ ద్వారా వీడియోను ఆ జంటలోని పురుషునికి పంపి 2000 దిర్హామ్‌లు (సుమారు రూ.36,500) ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 
 
లేదంటే అతని భార్యనైనా ఇవ్వమని బెదిరించాడు. తను అడిగింది ఇవ్వకపోతే తీసిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. కాగా భారతీయ వ్యక్తి మరో స్నేహితుడి సహాయంతో పథకం వేశాడు. పథకం ప్రకారం అతడికి డబ్బు ఇస్తాం రమ్మని హోటల్‌కు పిలిచారు. మరోపక్క పోలీసులను ఆశ్రయించి జరిగింది వివరించారు. డబ్బు ఆశతో వచ్చిన పాకిస్థాన్‌ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ జరిపిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. టెక్నాలజీ సహాయంతో దంపతుల ప్రైవసీకి భంగం కలిగించాడని.. బ్లాక్‌మెయిల్‌ చేశాడనే నేరాలు కోర్టులో తేటతెల్లమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments