Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదంపై దిగివచ్చిన చైనా.. జాబితాలో లష్కరే తాయిబా, జైషేమహ్మద్

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ కూటమి మొట్టమొదటిసారిగా పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల చిట్టావిప్పింది. ప్రాంతీయంగా అవి సృష్టిస్తున్న హింసాకాండను వేలెత్తి చూపింది.

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:58 IST)
చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ కూటమి మొట్టమొదటిసారిగా పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల చిట్టావిప్పింది. ప్రాంతీయంగా అవి సృష్టిస్తున్న హింసాకాండను వేలెత్తి చూపింది. లష్కరే తాయిబా, జైషేమహ్మద్ వంటి సంస్థలను నేరుగా ప్రస్తావించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, వారి నిర్వాహకులను లేదా సమర్థకులను చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టంచేసింది.
 
వాస్తవానికి గతంలో పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల తీరుపై భారత్ తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. అయితే, భారత్ ఇలాంటి అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు బ్రిక్స్ సదస్సు సరైన వేదిక కాదని చైనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే చైనా ఇప్పుడు ఓ మెట్టు దిగివచ్చి సంయుక్త ప్రకటనలో పాక్ ఉగ్రవాద సంస్థల జాబితాను చేర్చడానికి అంగీకరించడం గమనార్హం. 
 
అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని కూడా ఆ ప్రకటనలో బ్రిక్స్ దేశాధినేతలు తెలిపారు. అంతరిక్షరంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంచుకుంటామని, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ఉత్పాతాల నివారణ వంటి అంశాల్లో అంతరిక్ష విజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటామని తెలిపారు. శిలాజ ఇంధనాలను ప్రభావయుతంగా వినియోగించాలని, సహజవాయువు, జలవిద్యుత్తు, అణుశక్తి వినియోగాన్ని విస్తృతపర్చాలని ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments