Webdunia - Bharat's app for daily news and videos

Install App

26/11 కేసు: విచారణను వాయిదా వేసిన పాకిస్థాన్ కోర్టు

Webdunia
సోమవారం, 28 జులై 2014 (11:36 IST)
26/11 కేసును పాకిస్థాన్ కోర్టు వాయిదా వేసింది. భారత ప్రభుత్వం శుక్రవారం పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించి, పాకిస్తాన్‌లో ముంబయి ఉగ్రవాద దాడుల కేసు విచారణను వాయిదా వేసినట్లు వచ్చిన వార్తలపై తీవ్ర నిరసన తెలియజేసింది. 
 
ముంబయి దాడులకు సంబంధించి ఏడుగురు నిందితులపై పెట్టిన కేసును విచారిస్తున్న పాక్ యాంటీ టెర్రరిస్టు కోర్టు జడ్జి వేసవి సెలవులపై వెళ్లినందున బుధవారం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 3 దాకా వాయిదా వేయడంతో భారత ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ కేసు విచారణ వాయిదా పడ్డం వరసగా ఇది ఏడోసారి కావడం గమనార్హం.
 
2008 నవంబర్‌లో 166 మంది ప్రాణాలను బలిగొన్న ముంబయి ఉగ్రవాద దాడులకు పథక రచన, నిధుల సమీకరణ, అమలు జరిపారన్న ఆరోపణలపై పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీవుర్ రెహమాన్ సహా ఆ సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులపై పాక్ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments