భారతీయ విద్యార్థులపై చైనా కక్ష... ఆన్‌లైన్ తరగతులకే పరిమితం!

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (14:14 IST)
కరోనా వైరస్ మహమ్మారిని సాకుగా చూపి భారతీయ విద్యార్థులపై చైనా కక్షగట్టింది. స్వదేశంలోకి అడుగుపెట్టొద్దని కోరుతోంది. ఇందుకోసం కరోనా వైరస్‌తో పాటు.. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను సాకుగా చూపుతోంది. పైగా, ఈ ఆంక్షలను మరోమారు పొడగించింది. 
 
దీంతో కరోనా నేపథ్యంలో స్వదేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు.. చైనాలోకి అడుగుపెట్టేందుకు ఆ దేశం నిరాకరించింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో ఆ దేశంలోకి భారతీయ విద్యార్థుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని మరోసారి పొడగిస్తున్నట్టు పేర్కొంది.
 
భారతీయ విద్యార్థులు మరికొంత కాలం ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ముఖ్య సమాచారం కోసం యూనివర్సిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సూచనలు పాటించాని సూచించింది. భారతీయ విద్యార్థుల సమస్యలను చైనాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.
 
కాగా.. 2018కి సంబంధించిన సమాచారం ప్రకారం చైనా యూనివర్సిటీల్లో దాదాపు 4.92లక్షల మంది విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో దాదాపు 23 వేల మంది భారత్‌కు చెందిన విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. 
 
2019 డిసెంబర్‌లో చైనాలో బయటపడ్డ కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. కాగా.. చైనాలోని చాలా విశ్వవిద్యాయాలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాయి. 
 
అయితే, అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను సాకుగా చూపుతున్న చైనా.. భారతీయ విద్యార్థులపై మాత్రం ఆంక్షలు విధిస్తోంది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాకుండా అడ్డుకుంటోంది. మరింత కాలం సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆన్‌లైనా క్లాసుల ద్వారా హాజరు కావాలని సూచిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments