Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్న 100 మంది గ్రామస్థులు... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (13:44 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన పాపువా న్యూగినియాలో విషాదం చోటుచేసుకుంది. కొండ చరియలు విరిగిపడటంతో వంద మందికిపై గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కొండ చరియలు ఓ గ్రామంపై పడ్డాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ఆ గ్రామస్థులు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. అంతేకాకుండా, కొండ చరియలు విరిగిపడటంతో ఆ గ్రామం మొత్తం నేలమట్టమైంది. రాజధాని పోర్ట్ మోరెస్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని కావోకలం అనే గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 
 
గ్రామస్థులు గాఢనిద్రలో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం. అయితే, మృతుల సంఖ్యపై అధికారులు మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. అలాగే, సహాయ చర్యలకు కూడా వర్షం అడ్డంకిగా మారింది. ఈ ఘటనపై ప్రధాని జేమ్స్ మార్పే తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments