Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యం ఎలా వుంది? అని అడిగేందుకు వెళ్తే కరోనా వైరస్ సోకింది...

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:02 IST)
కరోనా వైరెస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచంలో 25 దేశాల్లో ఈ వైరెస్ వ్యాపించి వుంది. వైరస్ సోకిన రోగులను ప్రత్యేక వార్డుల్లో వుంచి చికిత్స అందిస్తున్నారు. ఐతే తాజాగా యూఎఇలో వుంటున్న ఓ భారతీయుడికి కరోనా వైరెస్ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
కాగా యూఎఇలో ఇప్పటివరకూ 8 కరోనా వైరెస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి భారతదేశానికి చెందిన వ్యక్తి కూడా వున్నది. ఇతడు కరోనా వైరెస్ సోకిన రోగిని పరామర్శించేందుకు వెళ్లడంతో అది అతడికి వ్యాపించినట్లు వైద్యులు చెపుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తులను విడిగా ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ యూఎఇలో భయభ్రాంతులు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే కరోనా వైరెస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైరెస్ వ్యాప్తి ఎంతమాత్రం ఆగడటంలేదు. వివిధ దేశాలకు వ్యాపిస్తూనే వుంది. ఇది ఇలాగే సాగితే ప్రపంచంలో మరిన్ని దేశాలకు ఈ వైరెస్ వ్యాపించే ప్రమాదం వుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కోరలు చాచడంతో చైనా నుంచి రవాణా మార్గాలను పలు దేశాలు నిషేధించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments