Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌక బోల్తా... 13 మంది భారతీయుల గల్లంతు!!

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (14:15 IST)
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌక ఒకటి బోల్తాపడింది. ఈ ఘటనలో 13 మంది భారతీయులు గల్లంతయ్యారు. కొమొరస్ జెండాతో వెళుతున్న ఈ నౌక బోల్తాపడిన ప్రమాదంలో 13 మంది భారతీయులతో పాటు... ముగ్గురు శ్రీలంక సిబ్బంది కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే చమురు నౌక ఒకటి ఒమన్ తీరంలో ప్రమాదవశాత్తు బోల్పాడింది. నౌక మునిగిపోతున్నట్టు సముద్ర భద్రతా కేంద్రం వెల్లడించిన ఒక రోజు తర్వాత అది పూర్తిగా మునిగిపోయింది. అయితే, నౌక బోల్తా పడడం వల్ల చమురు కానీ, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు కానీ సముద్రంలో లీకవుతున్నదీ, లేనిదీ వెల్లడించలేదు.
 
నౌక యెమెనీ ఓడరేవు అడెనక్కు వెళ్తుండగా ఒమన్ ప్రధాన పారిశ్రామిక పోర్టు అయిన దుక్మలో బోల్తాపడింది. 117 మీటర్ల పొడవైన ఈ చమురు నౌకను 2007లో నిర్మించారు. ఇలాంటి చిన్నచిన్న నౌకలను తీరప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తారు. నౌకలోని వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments