టెహ్రాన్‌పై దాడులను ముమ్మరం చేసిన ఇజ్రాయెల్ - ఇరాన్ సీక్రెట్ అణు స్థావరం ధ్వంసం

ఠాగూర్
బుధవారం, 4 మార్చి 2026 (13:53 IST)
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఇరాన్ రహస్యంగా నిర్మించిన అణు స్థావరాన్ని ధ్వంం చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) అధికారింగా వెల్లడించింది. టెహ్రాన్‌ సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్‌ కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డెఫ్రిన్ తెలిపారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించినట్లు పేర్కొన్నారు. 
 
గత యేడాది జూన్ నెలలో తాము ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ సమయంలో వాడిన మందుగుండు సామగ్రి కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను ఈ నాలుగు రోజుల్లో ఇరాన్‌పై ప్రయోగించినట్లు తెలిపారు. గతంలో తాము ఇరాన్‌ అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా.. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని తమకు ఖచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు.
 
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300 క్షిపణి లాంచర్‌లను తాకాయని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ దేశంలోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు, వైమానిక రక్షణ వ్యవస్థలపై తమ వైమానిక దళాలు దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన తాజా దాడులకు సంబంధించిన దృశ్యాలను ఐడీఎఫ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు అల్లు అర్జున్ ప్రతి నెలా ఆర్థిక సాయం.. ఎంతంటే?

Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్

Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా

Chiranjeevi 158: ఉగాదికి ముందే షూటింగ్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments