Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పాప్ కల్చర్.. క్యాన్సర్ వ్యాధితో పోల్చిన కిమ్...?

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (14:23 IST)
ఉత్తరకొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. దక్షిణ కొరియా అధునాతన దేశంగా అభివృద్ది చెందితే, ఉత్తర కొరియా మాత్రం అందుకు విరుద్దంగా ముందుకు వెళ్తుంది. ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆ దేశంలో మొబైల్స్ చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 
 
ప్రభుత్వం నిర్ణయించిన హెయిర్‌స్టైయిల్స్ మాత్రమే యువత ఫాలో కావాలి. ఇంటర్నెట్ సౌకర్యం కుడా పెద్దగా అందుబాటులో ఉండదు. అయితే, గత కొంత కాలంగా దేశంలో దక్షిణ కొరియాకు చెందిన పాప్ కల్చర్ దిగుమతి అవుతుండటంతో యువత ఆలోచనలు క్రమంగా మారుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన కిమ్ దేశంలో పాప్ కల్చర్ పై నిషేదం విధించారు.
 
దేశంలో కే కల్చర్ ని క్యాన్సర్ వ్యాధితో పోల్చారు. కె కల్చర్ వలన వేషధారణ, హెయిర్‌స్టైయిల్‌, సంస్కృతిపై నాశనం అవుతున్నాయని వీటిని నిషేదించాలని కిమ్ చూస్తున్నారు. పాప్ కల్చర్‌తో దక్షిణకొరియాలో ఎక్కువమంది ఉపాది పొందుతున్నారు. వీరు ఎక్కువగా నార్త్ కొరియాలో ప్రదర్శనలు ఇస్తుంటారు. వీటిపై నిషేదం విధించడం వలన దక్షిణ కొరియాకు చెందిన పాప్ కల్చర్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకొవచ్చని, ఫలితంగా యువతపై పట్టు కొల్పోకుండా ఉంటామని కిమ్ ఆలోచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments