Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా పరికరాలు వాడొద్దు: బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం సూచన

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:53 IST)
ప్రస్తుతం చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 4జీ అప్‌గ్రేడేషన్‌లో చైనా టెలికాం పరికరాలను ఉపయోగించొద్దని భారత్‌ సంచార్‌‌ నిగమ్‌ లిమిలెట్‌ (బీఎస్ఎన్‌ఎల్‌)కు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (డీవోటీ) సూచించింది.

దీనికి సంబంధించి టెండర్‌‌ ప్రాసెస్‌ను కూడా సమీక్షించాలని చెప్పినట్లు అధికారులు చెప్పారు. ఎంటీఎన్‌ఎల్‌కు కూడా దీనికి సంబంధించి సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. అప్‌గ్రెడేషన్‌కు చైనా పరికరాలను ఉపయోగించొద్దని అనుబంధ సంస్థ మహానగర్‌‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు డీవోటీ సూచించింది.

సెక్యూరిటీ ఇష్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా తయారు చేసిన సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్‌ ఎప్పటికైనా డేంజరే అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌‌టెయిల్‌, వొడాఫోన్‌, ఐడియా హువాయితో కలిసి పనిచేస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం జెడ్‌టీఈతో కలిసి పనిచేస్తోంది.

కాగా.. చైనాకు చెందిన 52 యాప్‌లు యూజ్‌ చేయడం సేఫ్‌ కాదని, వాటి వాడకాన్ని తగ్గించాలని, లేదా బ్యాన్‌ చేయాలని సూచిస్తూ మన ఇంటెలిజెన్స్‌ అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments