ఐరాసలో నిధుల లేమి

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (06:03 IST)
ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఖజానా ఈ నెలాఖరుకు నిండుకోబోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. 230 మిలియన్ డాలర్ల లోటుతో నడుస్తున్న ఐరాస, ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేనట్లు తెలుస్తోంది.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ దాదాపు 37 వేల మంది ఉద్యోగులను ఉద్దేశించి రాసిన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జీతభత్యాలను చెల్లించేందుకు అదనపు చర్యలు తీసుకోవలసి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐరాస లోటు 230 మిలియన్ డాలర్లని తెలిపారు.

ఈ నెలఖరుకు ఐరాస ఖజానా ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోందన్నారు. 2019లో అవసరమైన నిధులలో 70 శాతం మాత్రమే సభ్య దేశాలు ఇచ్చాయన్నారు. దీనివల్ల సెప్టెంబరు చివరినాటికి 230 మిలియన్ డాలర్ల లోటు ఏర్పడిందని వివరించారు.

అక్టోబరు చివరినాటికి రిజర్వు నిధులు కూడా ఖర్చయిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అధికారిక పర్యటనలను తగ్గించుకోవడం, ఇంధన పొదుపు, సమావేశాల వాయిదా వంటి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడటానికి సభ్య దేశాలు బాధ్యత తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments