Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నగరాలతో నిత్యానంద కైలాస దేశం ఒప్పందాలు

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (10:19 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి స్థాపించిన కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకుందట. 'కైలాసతో 'సోదరి-నగరం' ఒడంబడికను చేసుకున్నట్లు న్యూజెర్సీలోని నెవార్క్‌ నగరం ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 12న జరిగిన ఈ సంతకాల కార్యక్రమానికి నగరంలోని సిటీ హాల్‌ వేదికగా నిలిచింది. 
 
మరోవైపు, రిచ్‌మండ్‌, వర్జీనియా, డేటన్‌, ఒహాయో, బ్యూనా పార్క్‌, ఫ్లోరిడా వంటి 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కైలాస దేశం వెబ్‌సైట్‌లో తెలిపింది. ఉనికిలో లేనిదిగా భావిస్తున్న నకిలీ దేశంతో ఇటువంటి ఒప్పందాలు కుదిరిన తీరును ఫాక్స్‌ న్యూస్‌ గురువారం ఓ కథనంలో విమర్శించింది. 
 
ఆ నకిలీ గురువు బోల్తాకొట్టించిన నగరాల జాబితా సుదీర్ఘంగా ఉందని ఆక్షేపించింది. పలు నగరాలు ఆయా ఒప్పందాల ప్రకటన నిజమేనని వెల్లడించాయంది. భారత్‌లో అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద దేశం నుంచి పారిపోయి ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి దాన్ని కైలాస దేశంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ దేశం తరపున కొందరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో హాజరై తమ దేశ గురించి వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments