Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నగరాలతో నిత్యానంద కైలాస దేశం ఒప్పందాలు

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (10:19 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి స్థాపించిన కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకుందట. 'కైలాసతో 'సోదరి-నగరం' ఒడంబడికను చేసుకున్నట్లు న్యూజెర్సీలోని నెవార్క్‌ నగరం ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 12న జరిగిన ఈ సంతకాల కార్యక్రమానికి నగరంలోని సిటీ హాల్‌ వేదికగా నిలిచింది. 
 
మరోవైపు, రిచ్‌మండ్‌, వర్జీనియా, డేటన్‌, ఒహాయో, బ్యూనా పార్క్‌, ఫ్లోరిడా వంటి 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కైలాస దేశం వెబ్‌సైట్‌లో తెలిపింది. ఉనికిలో లేనిదిగా భావిస్తున్న నకిలీ దేశంతో ఇటువంటి ఒప్పందాలు కుదిరిన తీరును ఫాక్స్‌ న్యూస్‌ గురువారం ఓ కథనంలో విమర్శించింది. 
 
ఆ నకిలీ గురువు బోల్తాకొట్టించిన నగరాల జాబితా సుదీర్ఘంగా ఉందని ఆక్షేపించింది. పలు నగరాలు ఆయా ఒప్పందాల ప్రకటన నిజమేనని వెల్లడించాయంది. భారత్‌లో అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద దేశం నుంచి పారిపోయి ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి దాన్ని కైలాస దేశంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ దేశం తరపున కొందరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో హాజరై తమ దేశ గురించి వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments