Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (11:09 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత ఆదివారం నైజీరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్‌ను ప్రదానం చేసింది. అబుజలో పర్యటనలో సందర్భంగా ప్రధాని మోడకి ఈ పురస్కారానికి అందజేశారు. 
 
కాగా, ప్రధాని మోడీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెనోవో సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. విశ్వాసం, గౌరవానికి గుర్తుగా 'అబుజా సిటీ కీ'ని మోడీకి బహుకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
ఆ తర్వాత అధ్యక్షుడి భవనంలో నైజీరీయా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబుతో ప్రధాని మోడీ సమావేశమైయ్యారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా మోడీ అభివర్ణించారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని, 140 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
 
విదేశీ పర్యటనలో భాగంగా తొలుత నైజీరియాలో అడుగు పెట్టిన మోడీ, అనంతరం బ్రెజిల్, గుయానాలో పర్యటించనున్నారు. ఈ నెల 21 వరకూ ఆయన విదేశీ పర్యటనలో ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments