Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాను కుదిపిస్తున్న వరదలు - ఇప్పటికే 600 మంది మృతి

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (10:28 IST)
నైజీరియా దేశంలో గత కొన్ని రోజులుగా కుంభవృష్ఠి కురుస్తుంది. దీంతో ఆ దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు 600 మందికిపైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంతా వర్షాలు కురిశాయి. దీంతో 13 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఈ వర్షాలు వచ్చే నెలాఖరు వరకు కొనసాగుతాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.  
 
గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షాలతో దేశం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా ఏకంగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇళ్లు కొట్టుకుపోవడం, ఇళ్లు మునిగిపోవడం కారణంగా 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది. పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లకపోవడంతోనే ప్రాణనష్టం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
 
వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు ఇప్పటికైనా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నైజీరియా మంత్రి సదియా ఉమర్ ఫరూఖ్ కోరారు. ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments