Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికిత్స చేసిన కరోనా రోగుల మృతి... చూసి తట్టుకోలేక వైద్యురాలి బలవన్మరణం

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (16:14 IST)
తాను చికిత్స చేసిన కరోనా రోగులు వరుసగా మరణించడాన్ని ఆమె తట్టుకోలేక పోయింది. వారి మృతులు ఆమెను కలసివేసింది. దీంతో ఆ మహిళా వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ బారిన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. ఈ నగరాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేసింది. వేలాది మంది ప్రజలు ఈ వైరస్ బారినపడ్డారు. వందలామంది మృత్యువాతపడ్డారు. 
 
అయితే, ఈ నగరంలోని ఓ ఆస్పత్రిలో లార్నా ఎం బిర్నా అనే 49 యేళ్ల మహిళ వైద్యురాలిగా మన్ ‌హట్టన్‌ న్యూయార్క్‌ అలెన్‌ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం మెడికల్‌ డైరెక్టర్‌ గా పనిచేస్తోంది. ఆమె పని చేస్తున్న ఆస్పత్రిలో అనేక మంది కరోనా రోగులను చేరారు. 
 
వారికి ఆమె చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె ఎంతోమందికి కరోనా బాధితులకు చికిత్స చేసింది. వారిలో కొందరి పరిస్థితి విషమించి, చనిపోవడాన్ని బిర్నా తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించారు. 
 
ఆత్మహత్యకు పాల్పడే ముందు బిర్నా తనతో మాట్లాడిందని గుర్తు చేసుకున్న ఆయన, తనలో ఎటువంటి మానసిక సమస్యలూ లేవని, కరోనా సోకిన రోగులను అంబులెన్స్ లోకి ఎక్కించే ముందే వారు మరణిస్తుంటే తట్టుకోలేకున్నానని చెప్పి భావోద్వేగానికి లోనైందని వెల్లడించారు. 
 
కరోనా రోగులను అటెండ్ చేసిన బిర్నాకు కూడా వైరస్ సోకిందని, వైరస్‌పై ఎంతో పోరాటం చేసి విజయం సాధించిన ఆమె, తిరిగి విధుల్లోకి చేరిందని తెలిపారు. ఇంతలోనే ఘోరానికి పాల్పడుతుందని ఊహించలేదని ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు చెబుతూ బోరున విలపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments