Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలోని శరణార్థ శిబిరంలో అగ్నిప్రమాదం.. మూడు తరాలవారు సజీవదహనం

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (08:50 IST)
గాజాలోని శరణార్థ శిబిరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్టుమెంటులో చిన్నారి పుట్టిన రోజు వేడుక రోజున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు చిన్నారుల కూడా ఉన్నారు. 
 
గాజాలోని ఓ శరణార్థ శిబిరంలో ఆనందంగా జరుపుకుంటున్న పుట్టనరోజు వేడుక చివరకి విషాదంగా మిగిలింది. ఈ భవనంలో ఉన్నట్టుండి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం తుడిసిపెట్టుకునిపోయింది. పుట్టిన రోజుల వేడుకలు జరుగుతున్న భవనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వీటిలో చిక్కుకుని ఏకంగా 21 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 
 
మూడు అంతస్తులన్న భవనంలో అబు రయా అనే వ్యక్తి కుటుంబం ఉంటుంది. ఈయన కుటుంబంలోని ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈజిప్టు నుంచి తమ బంధువు కూడా వచ్చాడు. దీంతో ఈ వేడుకలను వారంతా కలిసి ఆనందంగా జరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకునిపోయింది. మూడు తరాలకు చెందిన ప్రజలు సజీవదహనమయ్యారు. ఇంట్లో అధిక మొత్తంలో నిల్వచేసిన పెట్రోల్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుంటుందని స్థానికులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments