Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా? నవాజ్ షరీఫ్ ప్రశ్న

తన దేశ ప్రజలను కించపరిచేలా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు పాక్‌లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా అంటూ షరీఫ్ ప్రశ్నించడం ఇపు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (09:13 IST)
తన దేశ ప్రజలను కించపరిచేలా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు పాక్‌లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ ప్రజలంతా నిజాయితీపరులా అంటూ షరీఫ్ ప్రశ్నించడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. 
 
పనామా గేట్ కుంభకోణంలో నవాజ్ షరీఫ్‌తో పాటు.. ఆయన కుటుంబ సభ్యులంతా చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో పాక్ సుప్రీంకోర్టు షరీఫ్ కుటుంబ సభ్యులందరినీ నిందితులుగా ప్రకటించింది. ప్రధాని పదవికి షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
 
తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై షరీఫ్ మాట్లాడుతూ.. అందరూ తన కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారని, ఆమాట కొస్తే పాకిస్థానీయులందరూ నిజాయతీపరులా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉన్నవారందరూ నిజాయతీగా జీవిస్తున్నారా? అని ప్రశ్నించి కలకలం రేపారు. ఇక్కడ డబ్బు తీసుకున్నా సమస్యే, తీసుకోకున్నా సమస్యేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేసివుంటే నిర్భయంగా ఒప్పుకుంటానని తేల్చి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments