Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్ షరీఫ్‌కు దౌత్యపరమైన పాస్‌పోర్ట్

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (09:40 IST)
పనామా పేపర్స్ కేసులో 72 ఏళ్ల పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకుడైన నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు జులై 2017లో పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయనపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనేక అవినీతి కేసులు పెట్టింది. 
 
అలాగే ఆరోగ్య పరంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు నవాజ్‌కు నాలుగు వారాల అనుమతి మంజూరు చేయడంతో 2019లో నవాజ్ షరీఫ్ లండన్ వెళ్లిపోయారు.
 
తాను పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని లాహోర్ హైకోర్టుకు నవాజ్ గతంలో హామీ ఇచ్చారు. కాని పాకిస్థాన్ దేశానికి నవాజ్ షరీఫ్ రాలేదు. ఎట్టకేలకు తన సోదరుడు షెహబాజ్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో నవాజ్ పాక్ వచ్చేందుకు వీలుగా మార్గం సుగమమైంది. 
 
తద్వారా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరలో స్వదేశానికి రానున్నారు. పాక్ 23వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ తన అన్నయ్య అయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కోసం సంచలన ఆదేశాలు జారీ చేశారు.
 
ఈద్ తర్వాత పాకిస్థాన్‌కు తిరిగి వచ్చే దిశగా నవాజ్ షరీఫ్‌కు దౌత్యపరమైన పాస్‌పోర్ట్ జారీ చేయాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments