Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్ షరీఫ్‌కు దౌత్యపరమైన పాస్‌పోర్ట్

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (09:40 IST)
పనామా పేపర్స్ కేసులో 72 ఏళ్ల పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకుడైన నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు జులై 2017లో పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయనపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనేక అవినీతి కేసులు పెట్టింది. 
 
అలాగే ఆరోగ్య పరంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు నవాజ్‌కు నాలుగు వారాల అనుమతి మంజూరు చేయడంతో 2019లో నవాజ్ షరీఫ్ లండన్ వెళ్లిపోయారు.
 
తాను పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని లాహోర్ హైకోర్టుకు నవాజ్ గతంలో హామీ ఇచ్చారు. కాని పాకిస్థాన్ దేశానికి నవాజ్ షరీఫ్ రాలేదు. ఎట్టకేలకు తన సోదరుడు షెహబాజ్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో నవాజ్ పాక్ వచ్చేందుకు వీలుగా మార్గం సుగమమైంది. 
 
తద్వారా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరలో స్వదేశానికి రానున్నారు. పాక్ 23వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ తన అన్నయ్య అయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కోసం సంచలన ఆదేశాలు జారీ చేశారు.
 
ఈద్ తర్వాత పాకిస్థాన్‌కు తిరిగి వచ్చే దిశగా నవాజ్ షరీఫ్‌కు దౌత్యపరమైన పాస్‌పోర్ట్ జారీ చేయాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments