Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొండికేసిన భారత్‌ను చర్చల బల్లవద్దకు తీసుకొచ్చాం: బీరాలు పోయిన ముషారఫ్

కశ్మీర్‌పై ఎవరి మాటా వినకుండా మొండికేసిన భారత ప్రభుత్వాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చిన ఘనత తనదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బీరాలు పోయారు. కశ్మీర్ వేర్పాటువాదులకు తాము మద్దతు నిచ్చామని, వారికి అవసరమైన సహాయం కూడా చేశామని ముషారఫ్

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (06:40 IST)
కశ్మీర్‌పై ఎవరి మాటా వినకుండా మొండికేసిన భారత ప్రభుత్వాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చిన ఘనత తనదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బీరాలు పోయారు.  కశ్మీర్ వేర్పాటువాదులకు తాము మద్దతు నిచ్చామని, వారికి అవసరమైన సహాయం కూడా చేశామని ముషారఫ్ తొలిసారిగా బయటపెట్టారు. 
 
ఇస్లామాబాద్‌ కశ్మీర్‌లోని ‘స్వాతంత్య్ర సమరయోధుల’(కశ్మీర్‌ వేర్పాటువాదులు)కు తమ ప్రభుత్వం మద్దతుగా నిలబడిందనీ, వారికి అవసరమైన సహాయం చేసిందని పాకిస్తాన్  మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ సోమవారం చెప్పారు.
 
కేవలం వారితోనే పని అవ్వదనీ, కశ్మీర్‌ సమస్య పరిష్కారంపై భారత్‌తో చర్చలకు రాజకీయ విధానం అవసరమని అనంతరం  గుర్తించినట్లు తెలిపారు. భారత్‌ చర్చించడానికి కూడా ఇష్టపడని విషయాలపై రాజీ కుదుర్చుకునేందుకు తాము భారత్‌ను చర్చల వరకు తీసుకొచ్చామని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ముషార్రఫ్‌ దుబాయ్‌లో ఉంటున్నారు. ముషారఫ్ స్వయంగా భారత్‌తో చర్చలకోసం వాజ్‌పేయి హయాంలో ఆగ్రాకు వచ్చిన విషయం తెలిసిందే.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments