Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీస్‌లో ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు - 26 మంది సజీవ దహనం

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (12:23 IST)
గ్రీస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర విపత్తులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 మంది గాయపడ్డారు. వీరిలో వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని గ్రీస్ అధికారులు అంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో బోగీలకు నిప్పంటుకుని దగ్ధమైపోయాయి. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళుతున్న ఓ ప్రయాణికుల రైలు, తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్సూ రైలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. 
 
ఈ ప్రమాద తీవ్రతకు ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. పలు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ప్రమాద తీవ్రతకు ధ్వంసమైన ముందు భోగీల్లో 26 మంది సజీవదహనం కాగా, మరికొంతమందిని భద్రతా సిబ్బంది రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments