Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాంజానియాలోని ఏకైక బిలియనీర్ కిడ్నాప్.. ఆచూకీ తెలిపితే రూ.3 కోట్లు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:05 IST)
టాంజానియా ఆఫ్రికా దేశాల్లో ఒకటి. ఈ దేశంలోనే ఏకైక బిలియనీర్ మహ్మద్ డ్యూజీ. ఈయన భారత సంతతికి చెందిన కోటీశ్వరుడు. ఇటీవల ఈయన అవహరణకు గురయ్యారు. ఆయన ఆచూకీ కోసం టాంజానియా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ, రవ్వంత కూడా ఆచూకీ తెలుసుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆచూకీ తెలిపితే రూ.3 కోట్ల మేరకు రివార్డు ఇస్తామని ఆ దేశ పోలీసులు ప్రకటించారు.
 
ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున వ్యాయామం కోసం దారుసలాంలోని కొలొసియం హోటెల్‌ వద్దకు రాగానే సాయుధులైన కొందరు దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. 43 ఏళ్ల ఈ మాజీ రాజకీయనేత, పారిశ్రామికవేత్త. 'మో'గా ప్రసిద్ధి పొందారు. ఆఫ్రికాలోనే అత్యంత పిన్నవయస్కుడైన బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. 
 
డ్యూజీ సంపద ప్రస్తుతం 1.5 బిలియన్‌ డాలర్లుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఆయనను టాంజానియాలో ఏకైక బిలియనీర్‌గా వెల్లడించింది. కాగా, ఈయన అపహరణ కేసులో పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments