Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్‌తో కలిసి షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో నరేంద్ర మోడీ

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (10:33 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో తూర్పు దేశాల ఆర్థిక సదస్సుతో పాటు భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య దాదాపు 25 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ పర్యటనలో తన స్నేహితుడైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ప్రధాని మోడీ జ్వెజ్దా షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా, తక్కువ ధరకే ఆయుధాలను తయారు చేసే టెక్నాలజీని భారత్‌కు అందించే అంశంపై మోడీ రష్యా అధికారులతో చర్చించనున్నారు. 
 
ఈ టెక్నాలజీ మనకు అందింతే, తృతీయ శ్రేణి ప్రపంచ దేశాలను భారత్ అతి తక్కువ ధరకే ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయుధాల వ్యాపారంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments