Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ రైలులో వ్యక్తి ఆత్మహత్య.. మరో మహిళ మృతి... స్ఫృహకోల్పోయిన ప్రయాణీకులు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (15:32 IST)
జపాన్‌లో అత్యంత వేగంగా పరుగులు తీసే బుల్లెట్ రైలులో ఘోర సంఘటన సంభవించింది. టోక్యో నగరంలో పరుగులుతీస్తున్న బుల్లెట్‌ రైలులో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా తనతో తెచ్చుకున్న చమురును ఒంటిపై పోసుకుని సిగరెట్ లైటర్‌తో నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తితో పాటు మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. 
 
దీంతో రైలులో మంటలు చెలరేగాయి. రైలు అంతటా పొగలు వ్యాపించడంతో పలువురు ప్రయాణీకులు ఊపిరి ఆడక స్ఫృహ కోల్పోయారు. రైలులో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే రైలును నిలిపివేశారు.

కాగా జపాన్‌లో బుల్లెట్ రైలు పరుగులు తీయడం ప్రారంభమై సుమారు 50 కానుండగా ఇన్నేళ్ల కాలంలో బుల్లెట్ రైలులో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రధమం. రైల్వే అధికారులు కేసు నమోదు చేసుకుని, రైలులో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరు, అతనితో పాటు మృతి చెందిన మహిళ గురించి విచారణ జరుపుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments