Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలి దేశంలో సైనిక తిరుగుబాటు.. రక్తపాతం వద్దంటూ అధ్యక్షుడు రాజీనామా

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (08:51 IST)
అతి చిన్నదేశమైన మాలిలో సైనిక తిరుగుబాటు వచ్చింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సైనిక తిరుగుబాటుతో రక్తపాతం వద్దని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ... ఆయన తన పదవి నుంచి స్వచ్చంధంగా తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం తెల్లవారుజామున తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జాతీయ టీవీలో ప్రకటించారు. నిజానికి ఆయన పదవీకాలం మరో మూడోళ్ళపాటు ఉంది. 
 
కానీ, ఆ దేశ సైనికులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఫలితంగా బౌబాకర్ కీతా బుధ‌వారం తెల్ల‌వారుజామున‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తిరుగుబాటు చేసిన సైనికులు అధ్యక్షుడు ఇబ్ర‌హీంను అదుపులోకి తీసుకున్నారు.
 
అంత‌కుముందు విజ‌య సూచ‌కంగా అతని ఇంటి బయట గాలిలోకి కాల్పులు జరిపారు. రాజ‌ధాని న‌గ‌రం బొమాకోను త‌మ ఆధీనంలోకి తీస‌కున్నారు. అధ్య‌క్షుడితోపాటు ప్ర‌ధాని బౌబౌ సిస్సేను మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నిర్బంధించారు. తిరుగుబాటు సైనికుల‌తోపాటు, ప్ర‌జ‌లు కూడా భారీగా ‌రోడ్ల‌పైకి వ‌చ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments