Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలిలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ నరమేథం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (12:43 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థల్లో ఒకటి ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో నరమేథం సృష్టించింది. 50 మందితో వెళుతున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల కారణంగా ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులోని ప్రయాణికుల్లో 31 మంది మృత్యువాతపడ్డారు. 
 
దీనిపై బండియగర నగర మేయర్ హుస్సేనీ సాయే స్పందిస్తూ, అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన తీవ్రవాదులు ప్రయాణికుల ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ట్రక్కుకు మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీంతో ట్రక్కులో ఉన్న 50 మంది ప్రయాణికుల్లో 31 మంది సజీవదహనమయ్యారని చెప్పారు. 
 
మిగిలిన వారు తీవ్రంగా గాయపడినట్టు వివరించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఈ దారుణ ఘటనకు ఏ ఒక్క ఉగ్రసంస్థ నైతిక బాధ్యత వహించకపోయినప్పటికీ అల్‌ఖైదా అనుబంధ సంస్థే ఈ దారుణానికి పాల్పడిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments