Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలాకు అత్యున్నత గౌరవం... ఐరాస ‘శాంతిదూత’గా నియామకం

బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్‌ బహుమతి గ్రహీత, పాకిస్థాన్ యువతి మలాలా యూసఫ్‌జాయ్‌కు అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను శాంతిదూతగా ఎంపిక చేసినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రకటించార

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (11:43 IST)
బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్‌ బహుమతి గ్రహీత, పాకిస్థాన్ యువతి మలాలా యూసఫ్‌జాయ్‌కు అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను శాంతిదూతగా ఎంపిక చేసినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రకటించారు. ఐరాస శాంతిదూతగా నియమితులరాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా చరిత్ర సృష్టించింది. ఐరాస ప్రధాన కార్యాలయంలో వచ్చే వారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ హోదాను ఆమె కట్టబెడతారు. 
 
దీనిపై గుటెరస్ స్పందిస్తూ.. 'మహిళలు, యువతుల హక్కు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ మలాలా అసాధారణ ప్రతిభ కనబరుస్తుంది' అందుకే శాంతిదూతగా ఎంపిక చేసినట్లు వివరించారు. బాలికల విద్యా హక్కు కోసం మలాలా ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారన్నారు. 
 
శాంతిదూతగా మలాలాను ఎంపిక చేయడం వల్ల మహిళలకు మరింత మేలు చేకూరుతుందని తెలిపారు. 19ఏళ్ల మలాలా బాలిక విద్య కోసం పోరాడుతూ ఓ చిహ్నంలాగా నిలిచిందని కొనియాడారు. ఐరాస కార్యకలాపాలను, ఆదర్శభావాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు బాగా పాపులర్‌ అయిన ప్రముఖులను శాంతిదూతగా ఎంపిక చేయడం జరుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments