Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో జాతిపిత మహాత్మ గాంధీకి అవమానం.. విగ్రహాన్ని కూల్చేశారు..

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (11:12 IST)
నల్లజాతీయులకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంకా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ఇటీవల వాషింగ్టన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మరోసారి జాతిపిత మహాత్మ గాంధీకి అవమానం జరిగింది. 
 
భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఈ ఘటనపై భారతీయులు మండిపడుతున్నారు. మహాత్ముడిని అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరసనకారుల్లో కొంత మంది వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న గాంధీ విగ్రహం ధ్వంసం కావడంపై అమెరికా రాయబారి కెన్ జస్టర్ భారత్‌కు క్షమాపణలు చెప్పారు. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నామన్నారు. క్షమాపణలను స్వీకరించాలని భారత్‌ను ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments