Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజద్రోహానికి పాల్పడలేదు.. మరణశిక్ష తొందరపాటు తీర్పు : ముషారఫ్

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (11:25 IST)
తాను అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి రాజద్రోహానికి పాల్పడలేదని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. అదేసమయంలో తనకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం కూడా తొందరపాటేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
దేశద్రోహం నేరం కింద ముషారఫ్‌కు పెషావర్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. ముషారఫ్‌ తరపు న్యాయవాది అజార్‌ సిద్దిఖి లాహోర్‌ హైకోర్టులో 86 పేజీల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వాన్ని, ఇతరులను ప్రతిపవాదులుగా చేర్చారు. 
 
తీర్పు క్రమరాహిత్యంగా, విరుద్ధ ప్రకటనల మిశ్రమంగా ఉన్నదని, విచారణను వేగంగా, తొందరపాటుతో జరిపారని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే ఎటువంటి చర్యలను ముషారఫ్‌ తీసుకోలేదని అందులో వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన సాక్ష్యాల్లో సైతం అతనిపై రాజద్రోహం నేరం లేదని పేర్కొన్నారు. జస్టిస్‌ మజాహిల్‌ అలీఅక్బర్‌ నఖ్వి నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 9న ఈ పిటిషన్‌పై వాదనలను విననున్నది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments