Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ డ్రైవర్‌కు జాక్‌పాట్ : రాత్రికి రాత్రే కోటీశ్వరుడు... ఎలా?

Webdunia
సోమవారం, 5 జులై 2021 (08:04 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ డ్రైవర్‌కు జాక్‌పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరడయ్యాడు. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌ వారిని కోటీశ్వరులు చేసింది. ఆ లాటరీ టిక్కెట్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కష్టాలన్నీ తీరిపోయాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పొట్టకూటి కోసం కేరళకు చెందిన సోమరాజన్ అబుదాబికి వెళ్లాడు. ఈయన అబుదాబిలో గత 2008 నుంచి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అయితే, 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్‌లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్‌కు 3 కోట్ల దిర్హమ్‌లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. 
 
జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి ఉప్పొంగిపోతున్న సోమరాజన్ మాట్లాడుతూ.. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు. పైగా, తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments