Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లోని గురుద్వారపై ఉగ్రమూకల దాడి-25మంది మృతి

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (15:45 IST)
కాబూల్‌లోని గురుద్వారపై ఉగ్రమూకలు దాడి చోటుచేసుకుంది. ఆప్ఘనిస్థాన్ రాజధాని అయిన కాబూల్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 25 మందికి పైగా మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కాబూల్‌లోని షోర్‌ బజార్‌ ప్రాంతంలోని గురుద్వార లక్ష్యంగా బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. 
 
భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ 11 మందిని పొట్టనబెట్టుకున్నట్లు పేర్కొంది. షోర్‌ బజార్‌లోని ధరమ్‌శాలలో ఆత్మాహుతి దళాలు దాడులకు పాల్పడ్డాయి. గురుద్వార లోపల చిక్కుకుపోయిన సిక్కులను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
అయితే ఈ దాడులతో ఎటువంటి సంబంధం లేదని తాలిబన్‌ సంస్థ ప్రకటించింది. కాగా ఆప్ఘన్‌లో సిక్కులపై దాడిని భారత గృహ, పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తీవ్రంగా ఖండించారు.

మరోవైపు మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు చెప్తున్నారు. కాల్పుల విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమైనాడు. ఇకపోతే.. కాల్పులు జరిపింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. 
 
ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతున్న సమయలో ఇలాంటి దాడులు క్రూరమని భారత్ మండిపడింది. ఆప్ఘనిస్థాన్‌లో హిందువులు, సిక్కుల రక్షణకు అవసరమైన సాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించింది. గతంలో కూడా ఆప్ఘనిస్థాన్‌లో సిక్కులపై దాడి సంఘటనలో 19 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments