Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్ట‌న్ కోర్టుకు భార‌త సంత‌తి జ‌డ్జి

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:15 IST)
అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్‌లో ఉన్న అత్యున్న‌త న్యాయ‌స్థానానికి భార‌త సంత‌తికి చెందిన విజ‌య్ శంక‌ర్‌ జ‌డ్జిగా నియ‌మితులు కానున్నారు.

ఈమేరకు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒక‌వేళ ట్రంప్ ప్ర‌తిపాద‌న‌కు సేనేట్ ఆమోదం తెలిపితే, అప్పుడు కొలంబియా అప్పిల్ కోర్టుకు అసోసియేట్ జ‌డ్జిగా విజ‌య్ శంక‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారు.

వాషింగ్ట‌న్ డీసీలో కొలంబియా జిల్లా కోర్టు అత్యున్న‌త‌మైన‌ది. న్యాయ‌శాఖ‌ నేరవిభాగంలో ప్ర‌స్తుతం సీనియ‌ర్ లిటిగేష‌న్ అధికారిగా శంక‌ర్ ప‌నిచేస్తున్నారు. 
 
న్యాయ‌శాఖ‌లో చేర‌డానికి ముందు జ‌స్టిస్ శంక‌‌ర్ ప్రైవేటు ప్రాక్టీస్ చేశారు. వాషింగ్ట‌న్ కోర్టులోని జ‌డ్జి చెస్ట‌ర్ జే స్ట్రాబ్ వ‌ద్ద శంక‌ర్‌ క్ల‌ర్క్ గా చేశారు.

డ్యూక్ వ‌ర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. వ‌ర్జీనియా న్యాయ విద్యాల‌యం నుంచి జేడీ ప‌ట్టా పొందారు. వ‌ర్జీనియా లా రివ్యూకు నోట్స్ ఎడిట‌ర్‌గా చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments