అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్... ఇంటి ఐసోలేషన్‌లో చికిత్స

వరుణ్
గురువారం, 18 జులై 2024 (09:50 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ అధికారికంగా వెల్లడించింది. జో బైడెన్ దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆయన డెలావేర్‌ సముద్రతీరంలో ఉన్న తన ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. 
 
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్లో తేలడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు. ప్రచారంలో ఉన్న బైడెన్‌‍కు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఇంటి నుంచే ఆయన విధులు నిర్వర్తిస్తారని వైట్ హౌస్ తెలిపింది. స్వల్ప లక్షణాలు కనిపించగా.. పరీక్షలు నిర్వహించటంతో పాజిటివ్‌గా తేలినట్లు వివరించింది. 
 
ఆయనకు పాక్స్ విడ్ యాంటీ వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు తెలిపింది. యునిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న ఆయన అర్థంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్‌కు బయలుదేరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి ఎక్కేటప్పుడు బైడెన్ మాస్క్ ధరించి లేకపోవడం గమనార్హం. ఆయనతో ఉన్న విలేకరులతో తాను బాగానే ఉన్నట్లు వెల్లడించారు.
 
బైడెన్ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments