Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ కంట్రీ చైనాకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:56 IST)
డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గట్టివార్నింగ్ ఇచ్చారు. హద్దు మీరి తైవాన్‌పై దాడి చేస్తే మాత్రం సహించబోమని, తాము చైనాపై దాడి చేస్తామని హెచ్చరించారు. 
 
తైవాన్‌పై చైనా దాడికి తెగబడితే అపుడు తైవాన్‌ను ర‌క్షిస్తారా అని జో బైడెన్‌ను ఓ విలేఖ‌రి ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, ఒక‌వేళ తైవాన్‌పై చైనా దాడి చేస్తే, అప్పుడు తైవాన్‌కు అండ‌గా పోరాడుతామ‌ని తెలిపారు. 
 
అవును తాము ఆ విష‌యానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే తైవాన్ అంశంలో త‌మ ప్ర‌భుత్వ విధానంలో ఎటువంటి మార్పులేద‌ని వైట్‌హౌస్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. 
 
బైడెన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా తైవాన్ స్పందించింది. చైనా అంశంలో త‌మ విధానం ఏమీ మార‌ద‌ని, ఒక‌వేళ డ్రాగ‌న్ దేశం దాడి చేస్తే, తామే ప్ర‌తిదాడి ఇస్తామ‌ని తైవాన్ పేర్కొన్న‌ది. చాన్నాళ్ల నుంచి తైవాన్ అంశంలో అమెరికా వ్యూహాత్మ‌క మౌనాన్ని పాటించింది. అయితే తాజాగా బైడెన్ చేసిన కామెంట్ కొంత ఆస‌క్తిని రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments