మానవ రహిత కార్గోషిప్లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి జపాన్ విస్కీ చేరుకుంది. ఈ విస్కీ వ్యోమగాములు తాగేందుకు కాదని.. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేని చోట ఆల్కహాల్లో జరిగే మార్పులను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు దీనిని పంపారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీటిని అందజేసిన అనంతరం భూమికి ఆ వ్యోమనౌక బయల్దేరింది. సెప్టెంబరులో ఈ మానవ రహిత కార్గోషిప్ భూమికి చేరుకుంది. ఈ కార్గో షిప్ ద్వారా వ్యోమగాములకు అవసరమయ్యే నీరు, ఆహారం, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను, వాటితో పాటు పరిశోధనకు అవసరమైన జపాన్ కంపెనీకి చెందిన విస్కీని కూడా పంపించారు.