Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంపాలను తట్టుకునేలా బుల్లెట్ రైలు.. గంటకు 360 కిమీ వేగంతో పరుగు

Webdunia
శనివారం, 25 మే 2019 (17:35 IST)
జపాన్ బుల్లెట్ రైల్ సరికొత్త రికార్డును సృష్టించింది. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. తాజాగా నిర్వహించిన టెస్ట్ డ్రైవ్‌లో ఎన్.700 సుప్రీం అనే పేరు పెట్టిన బుల్లెట్ రైలు జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లి ఔరా అనిపించింది. 
 
పైగా, ఈ సుప్రీం బుల్లెట్ రైలును తక్కువ బరువుతో పాటు.. తక్కువ ఇంధన వినియోగంతో తయారు చేశారు. ముఖ్యంగా, జపాన్ దేశంలో భూకంపలు తరచూ సంభవిస్తాయన్న నేపథ్యంలో, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
 
కాగా, సెంట్రల్ జపాన్ రైల్వే కార్పొరేషన్ దీన్ని ప్రయోగాత్మకంగా మయబరా, క్యోటో నగరాల మధ్య నడిపి చూసింది. అత్యధికంగా 360 కిమీ వేగం అందుకున్నట్టు గుర్తించారు. బుల్లెట్ షింకాన్సెన్ రైళ్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వేగం అని జపాన్ రైల్వే వర్గాలు తెలిపాయి. జపాన్ లో 1964 నుంచి బుల్లెట్ రైళ్లు వినియోగంలో ఉన్నాయి.
 
కాగా, జపాన్ సహకారంతో భారత్ కూడా బుల్లెట్ రైల్‌ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెల్సిందే. ఈ రైలు ఢిల్లీ - అహ్మాదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments