Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కరోనా... ఎమర్జెన్సీ దిశగా జపాన్ అడుగులు

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:49 IST)
ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిన కరోనా వైరస్ అనేక దేశాలను పట్టిపీడిస్తోంది. ఇలాంటి దేశాల్లో జపాన్ ఒకటి. ఈ దేశంలో వైరస్ బారినపడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో జపాన్ పాలకులు అత్యయికస్థితిని (ఎమర్జెన్సీ)ని విధించాలన్న తలంపులో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం జపాన్ దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. జపాన్‌ ఇప్పటివరకు 3,500 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. రాజధాని టోక్యోలో దాదాపు 1000 పాజిటివ్‌ కేసులు నమోదు కావటం గమనార్హం.
 
దీంతో ఆ దేశ ప్రధాని షింజో అబే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మంగళవారం స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ జపనీస్‌ పత్రిక మొమియురి పేర్కొంది. 
 
ఈ సోమవారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తారని తెలిపింది. బుధవారం రోజున కరోనాను అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలను తెరపైకి తేనున్నట్లు న్యూస్‌ ఏజెన్సీ క్యోడో తెలిపింది. కరోనా వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments