Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత విమానాలపై నిషేధం విధించిన ఇటలీ - నెదర్లాండ్స్

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (10:14 IST)
భారత్ కరోనా కోరల్లో చిక్కుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూ పోతోంది. 
 
రెండు రోజులక్రితం సింగపూర్‌, న్యూజిలాండ్‌, కెనడా దేశాలు భారత్‌ నుంచి విమానాలపై ఆంక్షలు విధించగా, తాజగా ఈ జాబితాలో ఇటలీ, నెదర్లాండ్స్‌ చేరాయి. గత 14 రోజులుగా ఇండియాలో ఉన్న విదేశీయులు ఇటలీకి రాకుండా నిషేధం విధించే ఫైలుపై సంతకం చేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రొబెర్టో స్పెరాన్జా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.
 
అయితే ఇటలీకి చెందినవారు భారత్‌ నుంచి తిరిగి స్వదేశానికి రావచ్చని, అలాంటివారికి కరోనా నెగెటెవ్‌ రిపోర్టు తప్పనిసరని వెల్లడించారు. అదేవిధంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇటలీకి వచ్చినవారు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరామని చెప్పారు. 
 
మరోవైపు, భారత్‌ నుంచి అన్ని ప్యాసింజర్‌ విమానాలను రద్దుచేస్తున్నామని నెదర్లాండ్స్‌ ప్రకటించింది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నిషేధం సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మే 1 వరకు అమల్లో ఉంటుందని విమానయాన శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments