Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లజాతీయులను ఎలా టార్గెట్‌ చేశారో స్పష్టమైంది: ఫ్లాయిడ్‌ బంధువు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (09:53 IST)
అమెరికాలో నల్లజాతీయులను పోలీసులు ఏవిధంగా టార్గెట్‌ చేశారన్న విషయం జార్జి హత్యతో మరోసారి వెల్లడైందని, కేవలం చర్మం రంగు అధారంగా ఈవిధమైన హింసాకాండ సాగుతుందని పోలీసుల చేతిలో బలైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్యపై ఆయన సమీప బంధువు జార్జి ఫ్లాయిడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఆర్‌టి మీడియా సంస్థతో ఆయన గెట్టీస్‌బర్గ్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతూ.. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి దెరేక్‌ చావిన్‌ తన మేనల్లుడైన జార్జి హత్య సందర్భంగా తానేదో ఒక పెద్ద జంతువును వేటాడి చంపినట్లు ఫోజ్‌ ఇచ్చారని అన్నారు.

అత్యంత కిరాతకంగా జరిగిన ఈ ఘటన భవిష్యత్తులో అమెరికాలో మార్పులకు నాంది పలకాని ఆకాంక్షించారు. ఇదే సమయంలో జార్జి హత్యకు వ్యతిరేకంగా పలు నగరాల్లో ఆందోళనలు చేస్తున్న ప్రజలు హింసకు దూరంగా ఉండాలని కోరారు.

ఫ్లాయిడ్‌ మెడపై పలు నిమిషాల పాటు కాలుపెట్టి హత్య చేసిన దెరేక్‌లో తాను పాల్పడిన దురాగతంపై ఏమాత్రం పశ్చాతాపం కనపడుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.

కేవలం చర్మం రంగు అధారంగా ఈవిధమైన హింసాకాండ సాగుతుందని జోన్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ' పోలీసులు ఏం చెప్పారో జార్జి చేశారు. కానీ ఫలితం ఏంటో మీకు తెలుసు. అతను చనిపోయాడు.. కాదు చంపబడ్డాడు' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments