Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలో వైమానికదాడి.. 22 మంది చిన్నారులతో సహా 48 మంది మృతి

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (15:55 IST)
ఇజ్రాయెల్ - హమాస్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలతో గాజా ప్రాంతం మరోసారి దాడులతో దద్ధరిల్లిపోతోంది. ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఉత్తర గాజాలోని జాబిలియా ప్రాంతంలో ఇళ్లపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 48 మంది పౌరులు మరణించగా వారిలో 22 మంది చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అనేక నివాస భవనాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా హమాస్ ఒక ఇజ్రాయెల్ అమెరికన్ బందీని విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం 
 
మరోవైపు, గాజాలా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో యుద్ధ విరమణ ఒప్పందంపై నెలకొన్న ఆశలు సన్నగిల్లాయి. ఇటీవల ఇజ్రాయెల్ హుతీలు జరిపిన దాడుల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments