Webdunia - Bharat's app for daily news and videos

Install App

శతాబ్దాలుగా భారత్‌ అత్యంత సురక్షితమైన కేంద్రం : సుష్మా స్వరాజ్

Webdunia
బుధవారం, 20 జనవరి 2016 (09:30 IST)
ఒక్క యూదులకు మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అన్ని జాతులు, మతాల వారికి భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న ఆమె జెరూసలెంలో స్థానిక ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. 'శతాబ్దాలుగా భారత్‌ యూదులకు సురక్షిత కేంద్రంగా ఉంది' అని అన్నారు. 
 
భారత్‌ నుంచి వచ్చి ఇజ్రాయెల్‌లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రవాస భారతీయుల సేవా నిరతిని కొనియాడారు. ఇజ్రాయెల్‌లో సుమారు 80,000 పైగా భారత సంతతి యూదులు ఇజ్రాయెల్‌ పాస్‌పోర్టులతో ఉంటున్నారు. వీళ్లల్లో 10,000 మంది భారత పౌరులు కాగా.. మరో 8000 మంది సంరక్షకులుగా ఉంటున్నారు. మిగతా వారు వజ్రాల వ్యాపారులుగా.. ఐటీ ఉద్యోగులుగా, విద్యార్థులుగా, అసంఘటిత రంగ కార్మికులుగా ఉంటున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments