Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా ఆస్పత్రిలో పేలుడు... 500 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (10:11 IST)
హమాస్ ఉగ్రవాదులు చేసిన రాకెట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తుంది. ముఖ్యంగా, హమాస్ ఉగ్రవాదులకు మంచి పట్టుున్న గాజాలో రాకెట్‌ దాడులతో విరుచుకుపడుంది. తాజాగా గాజాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన పేలుడుధాటికి 500 మంది వరకు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడి వల్లే ఈ ఘోరం జరిగిందని హమాస్ ఆరోపిస్తుంది. 
 
గాజాలో ఎన్నడూలేని విధంగా ఆసుపత్రిలో పేలుడసంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. దీనికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపిస్తోంది. గాజా సిటీలోని అల్ అహ్లి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అవుతుంది. 
 
మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయెల్ అక్కడా బాంబు దాడులు చేస్తోంది. మంగళవారం దక్షిణ గాజాపై చేసిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనా వాసులు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. ఇటు లెబనాన్ సరిహద్దులోనూ మంగళవారం ఇజ్రాయెల్, హెజొ‌బొల్లా మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గాజాకు సాయం అందించడానికి మధ్యవర్తుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments