Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా ఆస్పత్రిలో పేలుడు... 500 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (10:11 IST)
హమాస్ ఉగ్రవాదులు చేసిన రాకెట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తుంది. ముఖ్యంగా, హమాస్ ఉగ్రవాదులకు మంచి పట్టుున్న గాజాలో రాకెట్‌ దాడులతో విరుచుకుపడుంది. తాజాగా గాజాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన పేలుడుధాటికి 500 మంది వరకు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడి వల్లే ఈ ఘోరం జరిగిందని హమాస్ ఆరోపిస్తుంది. 
 
గాజాలో ఎన్నడూలేని విధంగా ఆసుపత్రిలో పేలుడసంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. దీనికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపిస్తోంది. గాజా సిటీలోని అల్ అహ్లి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అవుతుంది. 
 
మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయెల్ అక్కడా బాంబు దాడులు చేస్తోంది. మంగళవారం దక్షిణ గాజాపై చేసిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనా వాసులు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. ఇటు లెబనాన్ సరిహద్దులోనూ మంగళవారం ఇజ్రాయెల్, హెజొ‌బొల్లా మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గాజాకు సాయం అందించడానికి మధ్యవర్తుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments