Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వీడియోలు చూడాలని ఐసిస్ ఉగ్రవాదులు ఒత్తిడి చేశారు : ఆంధ్రా వైద్యుడు

డాక్టర్ రామమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు. ఇటీవలే లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈయన ఆ ఉగ్ర సంస్థ గురించి అనేక విషయాలను వెల్లడించారు.

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (12:52 IST)
డాక్టర్ రామమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు. ఇటీవలే లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈయన ఆ ఉగ్ర సంస్థ గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇరాక్, సిరియా, నైజీరియా సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి సంబంధించిన వీడియాలను చూడాలని తమను బలవంతం చేసేవారని చెప్పారు.
 
అయితే వారు తమపై ఎప్పుడూ భౌతిక దాడులకు దిగలేదని, మాటలతో మాత్రం హింసించేవారని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో చాలామంది యువకులు బాగా చదువుకున్నవారేనని రామమూర్తి తెలిపారు. ముఖ్యంగా వారికి భారతదేశం గురించి చాలా విషయాలు తెలుసన్నారు. వీరంతా కలిసి భారత్‌ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
 
అదేసమయంలో తాను డాక్టర్‌ను కావడంతో ఆపరేషన్లను చేయాలని తనను బలవంతం చేసేవారని ఆయన పేర్కొన్నారు. తనను ఆపరేషన్ థియేటర్లోకి బలవంతంగా పంపించేవారని, అయితే తానెప్పుడూ ఆపరేషన్ కానీ, చిరికి కుట్లు కూడా వేయలేదన్నారు. తాను షిర్టేలో వర్కింగ్ క్యాంపులో ఉన్నప్పుడు ఉగ్రవాదులు మూడుసార్లు తనపై కాల్పులు జరిపారని, అదృష్టవశాత్తు తాను ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments